మహారాష్ట్రలోని భివాండీలో నివసించే విశ్వనాథ్ పాటిల్ అనే యువకుడు సోషల్ మీడియాలో జయా పాటిల్ అనే అమ్మాయి పేరుతో నకిలీ ఖాతా ఓపెన్ చేశాడు. ఈ ఖాతా ద్వారా ఉద్యోగాల కోసం వెతుకున్న యువతులను పరిచయం చేసుకున్నాడు. వారికి ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి.. వారి వద్ద డబ్బులు, విలువైన వస్తువులను తీసుకుంటూ వచ్చాడు.
ఫిర్యాదు చేసిన ఓ యువతితో ఫోన్ చేయించి తాను కల్యాణ్లోనే ఉన్నానని.. కలవాలని చెప్పడంతో విశ్వనాథ్ పాటిల్ అక్కడికి వచ్చాడు. అతడు వచ్చే రాగానే.. పోలీసులు చుట్టూ మూగి అతన్ని అరెస్ట్ చేశారు. విశ్వనాథ్ ఇప్పటివరకు 14 మంది యువతులను ఇలా మోసం చేశాడని పోలీసులు చెప్పారు. దీంతో పాటిల్పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.