పంచమి: వరాహి దేవి పూజ.. ఎరుపు వత్తులు.. నవధాన్యాల గారెలను..?

శుక్రవారం, 6 నవంబరు 2020 (05:00 IST)
Godess Varahi
పంచమి తిథిలో వరాహి దేవిని పూజిస్తే సమస్త దోషాలుండవు. పౌర్ణమి, అమావాస్య ముగిసిన ఐదో రోజున వరాహి దేవిని పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఈ తిథి మహత్తరమైనది. సప్తకన్యల్లో వరాహి దేవి ఒకరు. 
 
మనం చేసే కార్యాలు దిగ్విజయం కావాలంటే.. కార్యసిద్ధి కోసం వరాహి దేవిని పూజించడం ఉత్తమం. అదీ పంచమి తిథిలో వరాహి దేవి స్తుతితో అనుకున్న కోరికలు తీరుతాయి. ఆ రోజున వ్రతమాచరించి పూజిస్తే.. రుణబాధలుండవు. ఆర్థిక సమస్యలుండవు. వయోబేధం లేకుండా పంచమి తిథి రోజున వరాహి దేవి కోసం వ్రతమాచరించవచ్చు.
 
అయితే పంచమి తిథిలో జన్మించిన వారికి ఈ తిథిన వరాహి దేవి పూజ ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది. ఇంకా పంచమి తిథిలో జన్మించిన జాతకులు పుట్టకు పాలు పోయడం.. వరాహి దేవిని పూజించడం ద్వారా కార్యసిద్ధి చేకూరుతుంది. 
 
ఇంకా ఐదు నూనెలను కలగలిపి.. ఆమెకు దీపం వెలిగిస్తే సకలసంపదలు వెల్లివిరుస్తాయి. ఈ దీపానికి ఎరుపు వత్తులను వాడటం మంచిది. నైవేద్యంగా పొట్టు తీయని మినపప్పుతో తయారు చేసిన గారెలు లేకుంటే నవధాన్యాలతో చేసిన గారెలను, పెరుగన్నం, శెనగలు, పానకం వంటివి సమర్పించవచ్చు.  
 
ఇంకా "ఓం శ్రీ పంచమి దేవియే నమః" అనే మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే విశేష ఫలితాలను పొందవచ్చు. ఇంట సుభిక్షానికి కొదవవుండదు. రుణబాధలుండవు. దారద్ర్యం తొలగిపోతుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు