మార్గశిర పౌర్ణమి.. దత్తాత్రేయ జయంతి.. నెయ్యి, నువ్వుల దీపం..

మంగళవారం, 26 డిశెంబరు 2023 (09:25 IST)
మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి రోజున సత్యనారాయణ వ్రతం ఆచరించడం శుభ ఫలితాలను ఇస్తుంది. ఇంకా పౌర్ణమి రోజున హనుమంతుడి ఆలయానికి వెళ్లి ఆవాల నూనె లేదా నెయ్యితో దీపం వెలిగించాలి.  మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు రాహుకాలం సమయంలో దుర్గామాతకు దీపం వెలిగించడం ద్వారా సర్వశుభాలు చేకూరుతాయి. 
 
పౌర్ణమి అయిన నేడు మధ్యాహ్నం 2:04 గంటల నుంచి మధ్యాహ్నం 2:46 గంటల వరకు విజయ ముహూర్తం కావడంతో ఏదైనా శుభకార్యాన్ని ఈ ముహూర్తంలో ప్రారంభించడం విశేష ఫలితాలను పొందవచ్చు. 26 డిసెంబర్ 2023 సూర్యుడు దక్షిణయానం, ఈరోజు పౌర్ణమి తిథి మరుసటి రోజు 6:03 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. 
 
ఈరోజు మృగశిర నక్షత్రం రాత్రి 10:21 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత ఆరుద్ర నక్షత్రం ప్రారంభమవుతుంది. ప్రతి ఏటా మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి వేళ శ్రీ దత్తాత్రేయ జయంతిని జరుపుకుంటారు. దత్తాత్రేయుడిని పూజించడం వల్ల సకల దోషాలన్నీ తొలగిపోయి, కోరికలన్నీ నెరవేరుతాయని చాలా మంది నమ్ముతారు.  బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులైన త్రిమూర్తుల స్వరూపమే దత్తాత్రేయ స్వామి. దత్తాత్రేయుడిని ముక్కోటి దేవతల అవతారంగా భావిస్తారు. 
 
దత్తాత్రేయ స్వామి ప్రదోష కాలంలో జన్మించినందున మధ్యాహ్నం వేళలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేస్తారు. మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి వేళ దత్తాత్రేయుని అనుగ్రహం కోసం ఉపవాసం ఉండటం, పూజించడం ద్వారా కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని చాలా మంది నమ్ముతారు. త్రిమూర్తుల అంశంగా జన్మించిన దత్తాత్రేయుని పూజించడం వల్ల పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయని నమ్ముతారు. స్వామి వారికి పసుపు పువ్వులు, పసుపు వస్తువులను సమర్పించాలి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు