నేడు నిర్జల ఏకాదశి.. భీముడు ఆచరించిన ఉపవాస వ్రతం.. నీటిని దానం చేస్తే..?

బుధవారం, 31 మే 2023 (11:41 IST)
నేడు నిర్జల ఏకాదశి. భీముడు స్వయంగా ఆచరించిన ఉపవాసం కనుక భీమ ఏకాదశిగానూ జరుపుకుంటారు. ఈ రోజు నీటిని దానం చేసిన వారికి కోటి పుణ్యాలు లభిస్తాయి. ఈ ఏకాదశి రోజున ఉపవాసం వుంటే వైకుంఠ ప్రాప్తి సిద్ధిస్తుంది. 
 
ఈ మహిమాన్వితమైన రోజున పేదవారికి నీటిదానం చేయాలి. ఈ ఏకాదశి వ్రతం ద్వారా పుణ్య నదులలో స్నానమాచరించిన ఫలాలు, వివిధ దానాల ఫలాలు లభిస్తాయి. అంతేగాకుండా పుణ్య ఫలం చేకూరుతుంది. ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారు తమ పాపాల నుండి విముక్తులవుతారు. 
 
ఇంకా వారి పూర్వీకులు కూడా వంద తరాల పాపాల నుండి విముక్తులవుతారు. అలాగే ఈ రోజున నారాయణ స్వామి ఆలయంలో జరిగే ప్రత్యేక పూజలలో భాగం కావడం ద్వారా సర్వాభీష్టాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు