తిరుమలలో రాముడు.. ఏప్రిల్ 9న ఉగాది ఆస్థానం

సెల్వి

సోమవారం, 8 ఏప్రియల్ 2024 (20:18 IST)
Rama
ఉగాది సందర్భంగా, తెలుగు కొత్త సంవత్సరాది రోజున తిరుమల వేంకటేశ్వర స్వామిని వివిధ పౌరాణిక పాత్రల చిత్రాలతో అలంకరించారు. తిరుమల ఆలయం ముందు దశావతారాల  అలంకరణలు చేశారు. ఇందులో భాగంగా శక్తివంతమైన విల్లుతో పట్టుకున్న భారీ రాముడి విగ్రహం భక్తులను ఆకట్టుకుంటోంది. తిరుమలలో ఈ నెల 9న ఉగాది ఆస్థానం నిర్వహించనున్నారు. బంగారు వాకిలిలో అర్చకులు, పండితులు పంచాగ శ్రవణం, ఉగాది ఆస్థానం నిర్వహిస్తారు. 
Tirumala
 
ఉగాది సందర్భంగా టీటీడీ పలు ఆర్జిత సేవలను రద్దు చేసింది. ఉగాది పండుగను పురస్కరించుకుని ముందుగా మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాతం, అనంతరం శుద్ధి నిర్వహిస్తారు. అనంతరం బంగారు వాకిలిలో ఆగమ పండితులు, అర్చకులు పంచాంగ శ్రవణం, ఉగాది ఆస్థానం నిర్వహిస్తారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు