హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ బూమ్ ఒక్కసారిగా తారాస్థాయికి పెరిగిపోయింది. నగర శివారు ప్రాంతమైన రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో ఎకరం భూమి ధర ఏకంగా రూ.177 కోట్లు పలికింది. ఈ ప్రాంతంలోని ప్రభుత్వ స్థలాన్ని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ తాజాగా వేలం వేసింది.