మహిళలకు సానుకూల దృక్పథం చాలా అవసరం.. ఏం చేయాలి?

సెల్వి

శనివారం, 19 అక్టోబరు 2024 (20:00 IST)
సానుకూల దృక్పథం మహిళలకు చాలా అవసరమని మానసిక వైద్య నిపుణులు అంటున్నారు. సానుకూల దృక్పథం పరిస్థితులను గ్రహించడానికి వీలు కల్పిస్తుంది. కాబట్టి సానుకూలంగా ఉండటం చాలా అవసరం. సానుకూల వ్యక్తులు ప్రతి కార్యంలోనూ విజయవంతమవుతారు. దూరదృష్టి కలిగి ఉంటారు. ఒక విషయంపై లోతుగా ఆలోచిస్తారు. 
 
దీనికి విరుద్ధంగా, సందేహాలు, భయాలు, అభద్రాతా భావాలు వంటి ప్రతికూల ఆలోచనలు మానవ శరీరాన్ని బలహీనపరుస్తాయి. సానుకూలతో కూడిన ఆలోచనలు, భావోద్వేగాలను ఎదుర్కోవడానికి ఉపయోగపడతాయి. 
 
తద్వారా శ్వాసక్రియ మెరుగుపడుతుంది. సానుకూల దృక్పథాన్ని మెరుగు పరుచుకునేందుకు ప్రకృతితో సమయాన్ని గడపవచ్చు. అవగాహనను పెంచుకోవచ్చు. సమస్యలకు సృజనాత్మక పరిష్కారాలను కనుగొనవచ్చు. విశ్వాసాన్ని పొందవచ్చు. 
 
సృజనాత్మక పరిష్కారాల లేకపోవడం ఒత్తిడికి దారితీస్తుంది. ఇది వ్యక్తులను మానసిక స్థితిని దిగజార్చుతుంది. అందువల్ల, పువ్వులు వాసన చూడటం, పండ్లు తినడం, ధ్యానం చేయడం, స్నానం చేయడం, నవ్వడం, పాడటం, సంగీతం వినడం, నడవడం, నృత్యం చేయడం, ప్రియమైన వారితో ఉండటం వంటి కార్యక్రమాలలో సానుకూల దృక్పథాన్ని మెరుగుపరుచవచ్చు. 
 
అయితే ప్రతికూల ఆలోచనలు పెరుగుదల హార్మోన్లకు మద్దతు ఇవ్వవు. అవి నాడీ వ్యవస్థకు మద్దతు ఇవ్వవు. సో ఈ ఆధునిక ప్రపంచంలో రాణించాలంటే.. సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్లగలగాలి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు