శుక్రవారం రోజున స్త్రీలు ఈ పువ్వులు పెట్టుకుంటే..?

గురువారం, 4 అక్టోబరు 2018 (15:15 IST)
లక్ష్మీదేవి ధనధాన్యాలు ఇచ్చేవారు. ఈ అమ్మవారికి శుక్రవారం అంటే ప్రీతికరమైన రోజు. ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం వలన సిరిసంపదలు చేకూరుతాయని పురాణాలలో చెబుతున్నారు. అలానే కార్తీక మాసంలో వచ్చే శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ఆరాధించడం అష్టైశ్వర్యాలు చేరువవుతాయని చెబుతున్నారు. ఈ శుక్రవారం రోజున సూర్యోదయానికి ముందుగా లేచి స్నానమాచరించి ధవళ వస్త్రాలు ధరించాలి.
  
 
శుక్రవారం రోజున ఉపవాస దీక్షను చేపట్టి అమ్మవారిని పూజించాలి. స్త్రీలు ఈ రోజున తెల్లపువ్వులు, కుంకుమ రంగు పువ్వులను పెట్టుకుని లక్ష్మీదేవిని పూజించడం వలన వారు దీర్ఘసుమంగళీగా ఉంటారని భక్తులు విశ్వాసం. ఈ పువ్వులను లక్ష్మీదేవిని సమర్పించి ఆరాధించడం వలన కోరిక కోరికలు నెరవేరుతాయని విశ్వాసం.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు