శుక్రవారం పూట మహిళలు సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి, ఇంటిని, పూజగదిని శుభ్రం చేసుకుని పూజచేయడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు.
ఇంకా శుక్రవారం రోజున ఇంటికి వచ్చే ముత్తైదువులకు పసుపు, కుంకుమలిస్తే.. వంశం వృద్ధి, సకల సంపదలు, ఉద్యోగరీత్యా వృద్ధి వంటి మంచి ఫలితాలుంటాయి. దీంతో పాటు శుక్రవారం పూట పసుపు కుంకుమలిచ్చే మహిళలకు దీర్ఘసుమంగళీ ప్రాప్తం సిద్ధిస్తుందని విశ్వాసం.