దుర్గామాత అనుగ్రహం కోసం దుర్గాష్టమి రోజు నాడు దుర్గాష్టమి వ్రతంను ఆచరిస్తారు. ప్రతి నెల శుక్ల పక్షం 8వ రోజున దుర్గాష్టమి జరుపుకుంటారు. దుర్గాష్టమి వ్రతాన్ని ఆచరించేటువంటి భక్తులు ఈ రోజంతా తినడం కానీ తాగడం కానీ చేయకుండా ఉపవాసాన్ని ఉంటారు. కొన్ని ప్రాంతాలలో ఈ దుర్గాష్టమి రోజునాడు కుమారి పూజను కూడా ఆచరించడం ఆనవాయితీగా వస్తుంది.