నవరాత్రులు: గ్రహ దోషాలు తొలగిపోవాలంటే.. ఏం చేయాలి? (video)

బుధవారం, 28 సెప్టెంబరు 2022 (21:19 IST)
నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని పూజించడం ద్వారా సకల దోషాలు తొలగిపోతాయి. ఏడాదిలో నాలుగు నవరాత్రులు వస్తాయి. ఇందులో శరన్నవరాత్రులకు అత్యంత ప్రాముఖ్యమైనవి. ఈ నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రకాల అలంకరణలతో, తొమ్మిది రకాల నైవేద్యాలతో పూజించడం ద్వారా నవగ్రహ దోషాలను దూరం చేసుకోవచ్చు. సాధారణంగా శరన్నవరాత్రులు నవమితో ముగుస్తాయి. 
 
ముఖ్యంగా అష్టమి, నవమి తిథిల్లో అమ్మవారి ప్రార్థన విశేష ఫలితాలను ఇస్తుంది. ఈ రెండు తిథుల్లో అమ్మవారికి పూజలు చేయడం ద్వారా గ్రహదోషాలు తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఇంకా విడిపోయిన దంపతులు కూడా ఒక్కటవుతారు. దొంగతనం భయం, వస్తువులు వృధా, ద్రవ్యం వృధా వంటివి వుండవని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు