కుటుంబ సభ్యులు ... దేశ ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని వెంటనే జూదాన్ని ఆపమని దమయంతి కోరుతుంది. అయినా ఆమె మాటలు వినకుండా నలమహారాజు జూదం ఆడతాడు .. పందెంగా రాజ్యాన్ని కోల్పోతాడు. ఓడినవారు రాజ్యాన్ని విడిచి వెళ్లాలనే నియమం కూడా ఉండటంతో కట్టుబట్టలతో అక్కడి నుంచి కదులుతాడు. విధి కారణంగా ఓడిన భర్తను నిందిచడం వలన ఆయన మనసు మరింత గాయపడుతుందని దమయంతి భర్తను ఒక్కమాట కూడా అనదు.
అమ్మవారిపై భారంవేసి భర్తతో పాటు కష్టాలను అనుభవించడానికి ఆమె సిద్ధపడుతుంది. అడవిలోనైనా ఆయన సేవ చేసుకునే భాగ్యం దొరికితే తనకదే చాలని అనుకుంటుంది. ఆయన సేవ చేసుకోవడంలోనే తనకి నిజమైన ఆనందం కలుగుతుందని భావిస్తుంది. ఇక ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా తన పిల్లలను పుట్టింటికి పంపించి వేసి ఆనందంగా భర్తను అనుసరిస్తుంది.