కాగా.. ఈ-దర్శన కౌంటర్ల ద్వారా టిక్కెట్లను కేటాయించేవారు. ఈ క్రమంలో సుదర్శనం టిక్కెట్లకు కోత విధిస్తూ వచ్చిన తితిదే అధికారులు.. రూ.300 ఆన్లైన్ ప్రత్యేక దర్శన విధానానికి శ్రీకారం చుట్టారు. క్యూలైనలో నిరీక్షణ లేకుండా ఇంటర్నెట్ ద్వారా బుక్ చేసుకున్న సమయాల్లో శ్రీవారిని దర్శించుకునే చర్యలు తీసుకోవడంతోపాటు కోటాను భారీగా పెంచారు. ఈ తరుణంలో రూ.50 సుదర్శన టికెట్ల కేటాయింపు తగ్గుతూ వచ్చింది.
ఆన్లైన్ దర్శన విధానానికి మంచి స్పందన లభిస్తుండటంతో సుదర్శన టికెట్లను సోమ, మంగళ, బుధవారాల్లో మాత్రమే మంజూరు చేయడం ప్రారంభించారు. కానీ ఈ టిక్కెట్లను పూర్తిగా ఈ నెల ఒకటో తేదీ నుంచి పూర్తిగా రద్దు చేశారు. దీనిపై తితిదే ఎలాంటి ప్రకటన చేయలేదు.