జాతరలో ఏరులై పారుతున్న రక్తం
తిరుపతి గంగజాతరలో రక్తం ఏరులై పారుతోంది. జంతుబలి నిషేధం ఉన్నా సరే భక్తులు మాత్రం ఏ మాత్రం పట్టించుకోకుండా ఆలయ ఆవరణలో జంతువులను బలి ఇస్తున్నారు. జంతు బలితో ఆలయ ఆవరణ మొత్తం రక్తంతో నిండిపోయింది. దేవస్థానం అధికారులు మాత్రం చూసీచూడనట్లు నడుచుకుంటున్నారు.