ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సహిత శ్రీ మలయప్ప స్వామి ఉత్సవ దేవతలను కల్యాణోత్సవ మండపంలో ప్రత్యేక వేదికపై ఆసీనులను చేస్తారు. ఈ శుభ సందర్భంగా వివిధ రకాల సుగంధ, సాంప్రదాయ, అలంకార పుష్పాలతో పుష్ప యాగం చేస్తారు.
	
	ఉత్సవాల కారణంగా అక్టోబర్ 29న సహస్ర దీపాలకర సేవను, అక్టోబర్ 30న కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాలను టిటిడి రద్దు చేసింది.