తిరుమలను నో ఫ్లైయింగ్‌ జోన్ చేయాలంటూ అలిపిరి వద్ద ఆందోళన

శుక్రవారం, 17 జూన్ 2016 (22:15 IST)
తిరుమలను నో ఫ్లైయింగ్‌ జోన్‌గా ప్రకటించాలంటూ తిరుపతిలోని అలిపిరి వద్ద రాయలసీమ పోరాట సమితి ఆందోళనకు దిగింది. అమెరికా తరహా దాడులు జరిగితే తప్ప కళ్ళు తెరవరా అంటూ పోరాట సమితి నాయకులు నిరసన వ్యక్తం చేశారు. లక్షలాదిమంది భక్తుల ఆరాధ్య దైవమైన తిరుమల వెంకన్న నెలవున్న తిరుమలను ఎందుకు నో ఫ్లైయింగ్‌ జోన్‌ చేయరో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

వెబ్దునియా పై చదవండి