ముఖ్యమంత్రి చంద్రబాబుకి శ్రీవారి భక్తులు మొర.. ఎందుకు?

శుక్రవారం, 22 డిశెంబరు 2017 (21:17 IST)
ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు శ్రీనివాసుని భక్తులు మెయిల్స్ పంపుతున్నారట. ఆ మెయిల్స్‌లో టిటిడి ఉన్నతాధికారుల అనాలోచిత నిర్ణయమంటూ సమాచారాన్ని పంపారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎంతో వ్యయప్రయాసలుకోర్చి ఎలాగోలా దర్శించుకుని ప్రసాదాలను తీసుకెళదామనుకుంటే ఆ ప్రసాదం రేట్లను ఇంత భారీ స్థాయిలో పెంచడమా అంటూ శ్రీవారి భక్తులు మెయిల్స్ ద్వారా పంపారు. అంతటితో ఆగలేదు... టిటిడి ఉన్నతాధికారులు ఇష్టానుసారం నిర్ణయాలు తీసేసుకుంటున్నారు.. వారిపై నియంత్రణ ఖచ్చితంగా ఉండాలంటూ మెయిల్స్ ద్వారా కోరారు.
 
మెయిల్స్ పంపింది ఒకరిద్దరు కాదు.. ఏకంగా 5 లక్షల మంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మెయిల్స్‌కు ఈ స్థాయిలో మెయిల్స్ రావడం ఇదే ప్రథమమంటున్నారు సిఎం పేషీ అధికారులు. మెయిల్స్ మొత్తాన్ని ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తున్నామని చెబుతున్నారు. తిరుమల శ్రీవారి చిన్న లడ్డూను 25 రూపాయలకు బదులు 50 రూపాయలు, పెద్ద లడ్డూను 100కు బదులు రెండు వందల రూపాయలు పెంచిన విషయం తెలిసిందే. ఇలా రేట్లను పెంచుకుంటే పోతే తమ పరిస్థితి ఏంటని సామాన్యభక్తులు మెయిల్స్ ద్వారా సమాచారం పంపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు