తిరుపతి గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

బుధవారం, 31 మే 2017 (14:28 IST)
తిరుపతి గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా ప్రారంభమయ్యాయి. ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలను తితిదే ప్రారంభించింది. వేదపండితుల వేదమంత్రోచ్ఛారణల మధ్య గరుడపటాన్ని ధ్వజస్థంభంపై ఎగురవేసి సర్వదేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. 
 
కర్కాటక లగ్నంలో ధ్వజారోహణ ఘట్టాన్ని నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాలు జూన్ 8వ తేదీ వరకు జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాల సమయంలో రోజుకో వాహనంపై స్వామి, అమ్మవార్లు ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. అధికసంఖ్యలో భక్తులు స్వామివారి ధ్వజారోహణ కార్యక్రమాన్ని తిలకించారు. గోవిందనామస్మరణలతో గోవిందరాజ ఆలయం మార్మోగింది. 

వెబ్దునియా పై చదవండి