అందరికీ శ్రీవారి సేవా టిక్కెట్లు... సుప్రభాతం 6,985, వసంతోత్సవం 9,030 టిక్కెట్లు

శుక్రవారం, 16 జూన్ 2017 (11:03 IST)
కలియుగ వైకుంఠుడు తిరుమల వెంకన్న సేవలను దర్శించుకునే అవకాశాన్ని సామాన్య భక్తులకు ఆన్‌లైన్‌లో అందిస్తోంది తితిదే. 44,896 ఆర్జిత సేవా టిక్కెట్లను విడుదల చేసింది. అయితే సేవా టిక్కెట్లు విడుదల చేసిన కొద్దిసేపటికే టిక్కెట్లు అయిపోతున్నాయన్న విషయాన్ని గుర్తించుకున్న తితిదే ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ఆ‌న్‌లైన్‌లో సాఫ్ట్‌‌‌వేర్‌ను మార్పు చేశారు. నెట్‌ స్లోగా ఉన్నా ఆన్‌లైన్ సేవాటిక్కెట్లు ఈజీగా భక్తులకు దొరికే అవకాశం ఉంది. 
 
తితిదే విడుదల చేసిన టిక్కెట్లలో సుప్రభాతం 6,985, తోమాల 90, అర్చన 90, అష్టదళ పాదపద్మారాధన 120, విశేష పూజ 1125, నిజపాద దర్శనం 2,300, కళ్యాణోత్సవం 8,250, ఊంజల్ సేవ 2,200, ఆర్జిత బ్రహ్మోత్సవం 4,730, వసంతోత్సవం 9,030, సహస్ర దీపాలంకరణ సేవ 9,976 టిక్కెట్లను విడుదల చేసింది. 

వెబ్దునియా పై చదవండి