పర్యాటక గుర్తింపును కోల్పోతున్న 'అందాల గోవా'

దేశంలో మంత్రముగ్ధులను చేసే పర్యాటక ప్రాంతాల్లో గోవా ఒకటి. ఈ అందాల భూతల స్వర్గం.. ఇటీవలి కాలంలో వార్తల్లో బాగా నానుతోంది. గోవా అందాలను తిలకించేందుకు వచ్చే స్వదేశీ, విదేశీ పర్యాటకుల్లో అభద్రతా భావం నెలకొంది. ఇందుకు కారణం లేకపోలేదు. జర్మన్ చిన్నారిపై అత్యాచారం, ఆపై హత్య కేసు దేశంలో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత మరో సంఘటన జరిగింది. దీంతో విదేశీ పర్యాటకులు ఇక్కడకు వచ్చేందుకు వెనుకంజ వేస్తున్నారు. ఇదే విషయాన్ని స్వయంగా ఆ రాష్ట్ర పర్యాటక మంత్రి ఫ్రాన్సిస్కో అలియాస్ మిక్కీ పచ్చాకో వెల్లడించారు.

ఈ మేరకు ఆయన ఆ రాష్ట్ర హోం మంత్రి రవి నాయక్‌‍కు లేఖ రాయగా, అందులో తన సందేహాలను వెల్లడించారు. పర్యాటకులకు గోవా అత్యంత సురక్షిత ప్రాంతమని చాటి చెప్పేందుకు తన శాయశక్తులా కృషి చేస్తామన్నారు. అయినప్పటికీ కొంతమంది ప్రజలు నమ్మేందుకు సిద్ధంగా లేదన్నారు. అంతేకాకుండా జర్మన్ బాలిక హత్య అనంతరం జరిగిన నేరాలపై విచారణ జరిపించాలని హోం మంత్రిని పర్యాటక మంత్రి విజ్ఞప్తి చేశారు.

వెబ్దునియా పై చదవండి