లాక్‌డౌన్ ఆంక్షల సడలింపు: ఎగబాకే ధోరణిని కొనసాగిస్తున్న మార్కెట్

సోమవారం, 1 జూన్ 2020 (21:09 IST)
ప్రభుత్వం లాక్‌డౌన్ ఆంక్షల ప్రకటన చేసిన తరువాత వరుసగా నాలుగవ రోజు కూడా భారతీయ స్టాక్ మార్కెట్లు అధిక నోటుతో ముగిశాయి. ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి తీసుకున్న చర్యల నడుమ నిఫ్టీ 2.57% లేదా 245.85 పాయింట్లు పెరిగి 9826.15 వద్ద ముగిసింది, అయితే సెన్సెక్స్ 2.71% లేదా 879.42 పాయింట్లు పెరిగి 33,303.52 వద్ద ముగిసింది.
 
సానుకూల గమనికలతో ముగిసిన రంగాల సూచీలు
అన్ని రంగాల సూచీలు సానుకూల గమనికతో ముగిశాయి. బిఎస్‌ఇ స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ 2% -3% పెరిగాయి. ఇందులో, ఐడిబిఐ బ్యాంక్ (19.95%), పిఇఎల్ (15.07%), వోల్టాస్ (12.45%), బజాజ్ ఫైనాన్స్ (10.62%) ఉన్నాయి. అయినప్పటికీ, అజంతా ఫార్మా (4.64%), బేయర్ క్రాప్‌సైన్స్ లిమిటెడ్ (4.13%), పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జి (3.35%), డాక్టర్ రెడ్డి లాబొరేటరీస్ (2.92%), మరియు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ (2.53%) బిఎస్‌ఇలో నష్టపోయిన వారిలో అగ్రస్థానంలో ఉన్నాయి.
 
జూన్ 15న జరుగబోయే ఎన్‌సిఎల్‌టితో మాక్స్ ఇండియా తన అవిలీనతను ప్రకటించింది. మాక్స్ ఇండియా వాటాదారులకు ముఖ విలువ రూ. 10ల చొప్పున 1 ఈక్విటీ షేర్‌ను జారీ చేస్తారు.
 
నిధుల సమీకరణ దిశగా ఎం అండ్ ఎం ఫైనాన్షియల్: ఎం అండ్ ఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ రైట్స్ ఇష్యూ ద్వారా రూ. 3,500 కోట్ల నిధులను సేకరించడానికి సిద్ధమైంది. కంపెనీ వాటా 5.67% పెరుగుదలను చూపించింది.
 
దేశం ఐదవ దశ లాక్‌డౌన్ లోనికి ప్రవేశించడంతో, దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి యొక్క దేశీయ అమ్మకాలు మే నెలలో 13,865గా నమోదయ్యాయి. ఈ కంపెనీ షేర్ ధర 2.62% పెరుగుదలను చూపించింది. ప్రస్తుతం ఈ స్టాక్ రూ. 5758 వద్ద ట్రేడవుతోంది.
 
అదానీ పవర్ షేర్ ధర 9.20% పెరుగుదలను చూపించింది. రూ. 39 వద్ద వాణిజ్యమవుతున్న ఈ షేర్, బిఎస్‌ఇలో అత్యధికంగా 7.4% లేదా రూ. 2.65గా గుర్తించబడింది. ఇంట్రాడే గరిష్ఠంగా రూ. 40 వద్ద ప్రారంభమైంది. అయితే ఈ షేరు చివరకు రూ. 39.75 వద్ద ముగిసింది.
 
సానుకూల ప్రపంచవ్యాప్త భావోద్వేగ ధోరణులు
ఆర్థిక వ్యవస్థలు కొన్ని పరిమితులతో కార్యకలాపాలను పునరుద్ధరించడంతో, ప్రపంచ మార్కెట్ కూడా సానుకూల స్పందనను ప్రదర్శించింది. భారతీయ స్టాక్ మార్కెట్, ప్రపంచ మార్కెట్‌తో సమకాలీకరించడం సానుకూల గమనికతో ముగిసింది. ప్రధాన మార్కెట్ సూచీలు బ్యాంకింగ్ సూచీ మార్కెట్లో ఆధిక్యంలో ఉండటంతో అవి సానుకూల ధోరణిని చూపించాయి. నిక్కీ 225 0.81%, హాంగ్ సెంగ్ 3.36%, ఎఫ్‌టిఎస్‌ఇ ఎంఐబి 1.00% పెరిగింది.
 
సానుకూల మార్కెట్ కదలికలు, పెట్టుబడిదారుల మనోభావాలు కూడా పరిస్థితులన్నీ సాధారణ స్థితికి చేరుకుంటాయనే అంచనాలతో నడుస్తుంది. మార్కెట్ ఊర్థ్వ ధోరణిని చూపించినప్పటికీ, అమెరికా-చైనా సంబంధాలలో మరింత క్షీణత పెట్టుబడిదారుల మనోభావాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
 
- అమర్ దేవ్ సింగ్, హెడ్ అడ్వైజరీ, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు