అమెజాన్‌కు తేరుకోలేని షాకిచ్చిన ఆర్బీఐ - రూ.3.06 కోట్ల అపరాధం

శుక్రవారం, 3 మార్చి 2023 (22:14 IST)
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు భారత రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తేరుకోలేని షాకిచ్చింది. ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్, కేవైసీ నిబంధనలను ఉల్లంఘించినందుకు రూ.3.06 కోట్ల జరిమానా విధిస్తున్నట్టు ఆర్బీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే ఆర్బీఐ అమెజాన్‌కు షోకాజ్ నోటీసులు ఇచ్చిది. ఇందులో జరిమానా ఎందుకు విధించకూడదు అనే అంశంపై కారణం చూపాలని సూచించింది. 
 
ఎంటీటీ రెస్పాన్స్‌ను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఆర్బీఐ గైడ్‌లైన్స్ పాటించలేదన్న అభియోగం రుజువైందని తెలిపింది. అదేవిధంగా కస్టమర్ల లావాదేవీలకు పెనాల్టీతో సంబంధం లేదని స్పష్టంచేసింది. అమెజాన్ పే అనేది ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ యొక్క డిజిటల్ చెల్లింపు విభాగం. అయితే, డిజిటల్ చెల్లింపుల విషయంలో ఫోన్‌పే, గూగుల్ పే అత్యుత్తమ సేవలు అందిస్తున్నాయి. కానీ, అమెజాన్ మాత్రం కేవలం ఒక్క శాతం మేరకు మాత్రమే చెల్లింపులు జరుపుతుంది.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు