విజయంతో ఒలింపిక్స్‌లో ఆట మొదలెట్టిన మేరీకోమ్

ఆదివారం, 25 జులై 2021 (15:21 IST)
ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ మెక్ మేరీ కోమ్ విజయంతో తన ఒలింపిక్స్ ఆటను మొదలుపెట్టారు. ఆదివారం జరిరగిన 51 కిలోల విభాగం మహిళల బాక్సింగ్‌లో అదరగొట్టింది. డొమినికన్ రిపబ్లిక్‌కు చెందిన హెర్నాండెజ్ గ్రేసియా మిగ్వెలినాను ఆమె.. 4-1 తేడాతో మట్టి కరిపించింది. ఒక్క రెండో రౌండ్ మినహా మిగతా అన్ని రౌండ్లలోనూ ఆధిపత్యం ప్రదర్శించి.. రౌండ్ ఆఫ్ 16ను గెలిచి ప్రి క్వార్టర్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది. 
 
ఈ రౌండ్‌లో కొలంబియాకు చెందిన ప్రపంచ మూడో ర్యాంకర్ వాలెన్సియా విక్టోరియాను ఎదుర్కోనుంది. ఈ మ్యాచ్ జులై 29న జరగనుంది. లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన మేరీ కోమ్‌కు ఆ రౌండ్ సవాల్‌తో కూడుకున్నదే.
 
మరోవైపు, టేబుల్ టెన్నిస్‌లో మనికా బాత్రా ముందంజ వేసింది. మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లింది. ఉక్రెయిన్‌కు చెందిన మార్గరీటా పెసోస్కాను 4-3 తేడాతో ఓడించింది. రెండు మ్యాచ్ పాయింట్లను చేజార్చుకున్నప్పటికీ.. పుంజుకున్న ఆమె విజయం సాధించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు