బాక్సింగ్ పవర్ పంచ్ : మేరీకోమ్‌ 'బంగారం'

బుధవారం, 8 నవంబరు 2017 (15:36 IST)
భారత మల్లయుద్ధ క్రీడాకారిణి మేరీ కోమ్‌ మరోమారు తన పంచ్ పవర్ చూపించారు. ఐదోసారి ఆసియా బాక్సింగ్ ఛాంపియన్ షిప్ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. బుధవారం జరిగిన ఫైనల్లో ఉత్తర కొరియాకు చెందిన యాంగ్‌ మీ కిమ్‌పై 5 - 0 తేడాతో విజయం సాధించారు. 
 
సెమీస్‌ బౌట్‌లోనూ ఆమె 5-0తో సుబాసా కొముర (జపాన్)పై గెలిచారు. ఇప్పటివరకు ఈ టోర్నీలో ఆరుసార్లు తలపడిన మేరీ ఐదుసార్లు స్వర్ణంతో మెరిసింది. ఈ విజయంతో 48 కేజీల బౌట్‌లో పసిడి నెగ్గిన తొలి భారత క్రీడాకారిణిగా కూడా మేరీ సరికొత్త రికార్డును సృష్టించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు