ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తుండగా.. భారీ శబ్ధం.. పరుగులు తీశారు.. తొక్కిసలాటలో?

ఆదివారం, 4 జూన్ 2017 (17:50 IST)
పుట్‌బాల్  స్టేడియంలో విషాధ ఘటనలు చోటుచేసుకున్న దాఖలాలున్న సంగతి తెలిసిందే. తాజాగా ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ చూస్తున్న అభిమానులు ఒక్కసారిగా భయపడటంతో జరిగిన తొక్కిసలాటలో దాదాపు 1,500మందికి పైగా గాయపడ్డారు. రియల్‌మాడ్రిడ్‌ జట్టు ఆడుతున్న ఛాంపియన్స్‌లీగ్‌ ఫైనల్‌ను పెద్ద స్క్రీన్‌పై చూసేందుకు పెద్దఎత్తును అభిమానులు పట్టణంలోని పిజ్జా శాన్‌ కార్లో ప్రాంతానికి తరలివచ్చారు. 
 
అయితే మ్యాచ్‌ ద్వితీయార్ధం చివరి పదినిమిషాలు ఉందనగా ఓ పెద్ధ శబ్ధం వినిపించింది. దీన్ని బాంబు పేలుడు అనుకున్న ఫుట్‌బాల్ అ  వారికి ఒక పెద్ద శబ్ధం వినిపించింది. దీనిని బాంబుపేలుడిగా భ్రమించిన అభిమానులు ఒక్కసారిగా పిజ్జాశాన్‌కార్లో బయటకు పరిగెత్తేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. చాలామంది బారికేడ్ల మధ్యపడి నలిగిపోయారు. 1500కి పైగా మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో చిన్నారితో సహా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

వెబ్దునియా పై చదవండి