ఉప్పల్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడుతుండగా గుండెపోటు.. 25ఏళ్ల వ్యక్తి మృతి.. ఆయన ఎవరు? (Video)

సెల్వి

సోమవారం, 28 జులై 2025 (12:15 IST)
Heart attack
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడుతున్నప్పుడు గుండ్ల రాకేష్ అనే 25 ఏళ్ల వ్యక్తి గుండెపోటుతో కుప్పకూలి మరణించాడు. అతన్ని ఆసుపత్రికి తరలించారు కానీ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. 
 
ఉప్పల్ స్టేడియంలోని ఇండోర్ కోర్టులో బ్యాడ్మింటన్ ఆడుతున్నప్పుడు 25 ఏళ్ల గుండ్ల రాకేష్ అనే వ్యక్తి కుప్పకూలిపోయాడు. అతని సహ ఆటగాళ్ళు, స్నేహితులు రాకేష్‌ను స్థానిక ఆసుపత్రికి తరలించినప్పుడు, అతనిని పరిశోధించిన వైద్యులు అతను చనిపోయినట్లు నిర్ధారించారు. 
 
హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న మృతుడు ఖమ్మం జిల్లా తల్లాడ మాజీ డిప్యూటీ సర్పంచ్ గుండ్ల వెంకటేశ్వర్లు కుమారుడు కావడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

షటిల్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలి 25 ఏళ్ల యువకుడు మృతి

నాగోల్ స్టేడియంలో షటిల్ ఆడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయిన రాకేష్

ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్టు నిర్ధారించిన వైద్యులు

మృతుడు ఖమ్మం జిల్లా తల్లాడ మాజీ ఉప సర్పంచ్ గుండ్ల వెంకటేశ్వర్లు కుమారుడు గుండ్ల… pic.twitter.com/v3rVaXM3gt

— Telugu Scribe (@TeluguScribe) July 28, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు