పీటీ ఉషకు అరుదైన గౌరవం

గురువారం, 15 ఆగస్టు 2019 (12:31 IST)
భారత దిగ్గజ అథ్లెట్‌ పీటీ ఉషకు అరుదైన గౌరవం దక్కింది. 80వ దశకంలో ఆసియా ప్రఖ్యాత స్ప్రింటర్‌గా కీర్తి పతాకాన్ని ఎగురవేసిన 55 ఏళ్ల ఉషకు ఆసియా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ (ఏఏఏ)లోని అథ్లెట్ల కమిషన్‌లో సభ్యురాలిగా చోటుదక్కింది. 
 
హ్యామర్‌ త్రోలో మాజీ ఒలింపిక్‌ చాంపియన్‌ యూజ్బెకిస్థాన్ కు చెందిన ఆండ్రీ అబ్దువలియెవ్ అధ్యక్షతన ఆరుగురు సభ్యుల ఏఏఏ అథ్లెట్ల కమిషన్‌లో ఉష ఓ సభ్యురాలిగా వ్యవహరిస్తారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు