నేటి నుంచి భద్రాచలం బ్రహ్మోత్సవాలకు అంకురారోపణం!!

బుధవారం, 28 మార్చి 2012 (11:03 IST)
File
FILE
ఖమ్మం జిల్లా భద్రాచలంలో శ్రీ సీతారాముని బ్రహ్మోత్సవ కార్యక్రమాలకు బుధవారం అంకురారోపణం చేయనున్నారు. వసంత పంచమి నాడు కల్యాణ మూర్తులకు విశేష స్నపనం, తిరుమంజనాలను నిర్వహించనున్నారు. శ్రీరాముని కల్యాణానికి ముందు జరిగే మంగళస్నానోత్సవాలుగా ఈ కార్యక్రమాలను భావిస్తారు. ఇందులో భాగంగా సీతారాములను నూతన వధూవరులుగా అలంకరింపజేస్తారు.

మరోవైపు... భద్రాచలం శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం, పట్టాభిషేకం ప్రత్యేక వీక్షణానికి అవసరమైన టికెట్లను బుధవారం నుంచి విక్రయించేలా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే రూ.3,016 విలువైన 1250 టికెట్లను ముద్రించగా ఇందులో 330 ఉభయ దాతలకు కేటాయించారు. మరో 10 టికెట్లకు డీడీలు వచ్చాయి. రూ.2000 విలువైన వీఐపీ టికెట్లు 1300 ఉండగా వీటిని రెవెన్యూ అధికారుల ద్వారా అమ్మకాలు సాగించాలని నిర్ణయించారు.

వెబ్దునియా పై చదవండి