శ్రీరామ నవమి.. రామబంటుకు సింధూరం.. సీతారామ కళ్యాణాన్ని వీక్షితే..

బుధవారం, 29 మార్చి 2023 (09:47 IST)
శ్రీరామ నవమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. శ్రీరాముడు జన్మించిన పవిత్రమైన రోజున శ్రీరామ నవమి వేడుకలుగా జరుపుకుంటారు. శ్రీరాముడు మధ్యాహ్నం సమయంలో జన్మించాడని.. అందుకే ఈరోజున పూజలన్నీ మధ్యాహ్నం సమయంలో నిర్వహిస్తారు. ఈ సమయంలో శ్రీరాముని ఆలయాలు, ఆంజనేయుని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 
 
ఇదిలా ఉండగా.. శ్రీరామ నవమి రోజున రామ రక్ష స్తోత్రాన్ని పఠించాలి. శ్రీరాములోరికి కుంకుమ పువ్వు కలిపిన పాలతో అభిషేకం చేయాలి. ఇలా చేయడం వల్ల సంపద పెరుగుతుంది. అలాగే శ్రీరామనవమి రోజున రామాయణ పారాయణం చేయడం ద్వారా శ్రీరాముడి అనుగ్రహం పొందవచ్చు. రాముడిని పూజించడం ద్వారా ఆయన భక్తుడైన హనుమంతుడు కూడా సంతసిస్తాడు. శ్రీరామ నవమి రోజున ఆంజనేయునికి సింధూరం సమర్పించాలి. 
 
సీతారాములకు భక్తి శ్రద్ధలతో పూజ చేసి సంకల్పం చెప్పుకుంటే తప్పకుండా కోరిన కోరికలు నెరవేరుతాయి.  ఈరోజున సుందరకాండను కూడా పఠించాలి. సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం శ్రీ సీతారాములను పూజించాలి. మీ జీవితంలో కష్టాల నుంచి విముక్తి పొందడానికి గంగాజలాన్ని లేదా ఏదైనా పవిత్ర నది నీటిని ఒక పాత్రలో తీసుకుని ‘ఓం శ్రీ హ్వీం క్లీం రామచంద్రాయ శ్రీ నమః’ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేస్తే సర్వశుభాలు చేకూరుతాయి. అలాగే శ్రీరామనవమి రోజున ఆలయాల్లో జరిగే సీతారామ కల్యాణ ఉత్సవాన్ని కనులారా వీక్షించే వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు