కావలసిన పదార్థాలు : బొంబాయి రవ్వ.. రెండు కప్పులు పెరుగు.. ఒక కప్పు నెయ్యి.. పావు కేజీ పంచదార.. అర కప్పు అరటిపండు.. ఒకటి
తయారీ విధానం : వెడల్పాటి పాత్రలో బొంబాయిరవ్వ, పావుకప్పు నెయ్యి, అరటిపండుగుజ్జు వేసి బాగా కలపాలి. మరోపాత్రలో పెరుగు, పంచదార పొడి కలపాలి. అందులో బొంబాయిరవ్వ మిశ్రమాన్ని వేసి 20 నిమిషాలు నాననివ్వాలి. స్టవ్మీద కడాయి పెట్టి మంట మరీ ఎక్కువా తక్కువా కాకుండా చూడాలి.
మిగిలిన నెయ్యి కడాయిలో వేసి కాగాక మిశ్రమాన్ని పైన కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసి, అరచేతిలో చిన్న చిన్న బిళ్లలుగా వత్తి నేతిలో వేసి, రెండువైపులా వేయించి తీయాలి. చివరగా ఇష్టమైతే వీటిమీద యాలకులపొడి చల్లి వేడివేడిగా సర్వ్ చేయాలి. అంతే పసందైన సింఘాల్ రెడీ..! టేస్టీగా, తియ్యగా ఉండే వీటిని చిన్నారులు చాలా ఇష్టంగా తింటారు.