కావలసిన పదార్థాలు : బొంబాయి రవ్వ... రెండు కప్పులు తురిమిన పచ్చికొబ్బరి... రెండు కప్పులు పంచదార... ఒకటిన్నర కప్పు నెయ్యి... అర కప్పు జీడిపప్పు... రెండు టీస్పూన్లు కిస్ మిస్... రెండు టీస్పూన్లు యాలకుల పొడి... పావు టీస్పూన్
తయారీ విధానం : మొదట దళసరి మూకుడులో కొంచెం నెయ్యి వేసి రవ్వను దోరగా వేయించుకోవాలి. దీంట్లో కొబ్బరి తురుము, పంచదార వేసి నీరు కొద్దిగా పోసి కలియ బెట్టాలి. చెక్కర కరిగి గట్టిపడుతున్నప్పుడు యాలకుల పొడి చల్లి దించుకోవాలి. ఈ మిశ్రమంలో నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్మిస్ వేసి ఆరిపోక ముందే గుండ్రంగా లడ్డూలు చుట్టుకోవాలి. లడ్డూలుగా చేసేటప్పుడు ఆరిపోయినట్లనిపిస్తే... కొంచెం పాలు చల్లుకుంటూ ఉండలు చుట్టుకుంటే బాగా వస్తాయి.