తెలంగాణాలో 26 మంది ఐఏఎస్‌ల బదిలీ - స్మితా సబర్వాల్ పోస్టు ఏంటి?

బుధవారం, 3 జనవరి 2024 (20:29 IST)
కర్టెసి-ట్విట్టర్
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. బుధవారం ఏకంగా 26 మంది అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీచేశారు. గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కాదర్శిగా ఉన్న స్మితా సబర్వాల్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా నియమించింది. 
 
అలాగే, గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా మహేశ్ దత్ ఎక్కా, ప్రణాళికా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా అహ్మద్ నదీమ్, సాగునీటి శాఖ కార్యదర్శిగా రాహుల్ బొజ్జాలపై బదిలీవేటు వేసింది. ఇప్పటివరకు వెయిటింగ్ లిస్టులో ఉన్న దివ్య, భారతి హోలికేరి, చిట్టెం లక్ష్మి తదితరులకు పోస్టింగులు ఇచ్చింది. అలాగే పలువురు కలెక్టర్లను కూడా బదిలీ చేయగా మరికొందరికి కలెక్టర్లుగా బాధ్యతలు అప్పగించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు