సివిల్స్‌లో తెలుగు యువతికి 3వ ర్యాంకు

ఐవీఆర్

మంగళవారం, 16 ఏప్రియల్ 2024 (19:47 IST)
సివిల్ సర్వీసెస్ పరీక్షా ఫలితాల్లో తెలుగు యువతి 3వ ర్యాంకు సాధించింది. తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామానికి చెందిన అనన్యరెడ్డి ఈ ర్యాంకు సాధించారు. తమ కుమార్తె 3వ ర్యాంకు సాధించడం పట్ల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేసారు.
 
కాగా దేశవ్యాప్తంగా 1016 మంది ఎంపికయ్యారు. వీరిలో ఆదిత్య శ్రీవాస్తవ ఫస్ట్ ర్యాంక్ సాధించగా అనిమేష్ ప్రధాన్ ద్వితీయ ర్యాంక్ సాధించారు. యూపీఎస్సీ పరీక్షలో 30 మందికి పైగా తెలుగు విద్యార్థులు ఎంపికయినట్లు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు