మద్యం మత్తు ఎంతటి దారుణానికైనా ఒడిగడుతుందనేందుకు ఈ ఘటనే నిదర్శనం. మద్యం మత్తులో 12 నెలల కూతురిని కసాయి తండ్రి నేలకేసి కొట్టాడు. ఈ ఘటనలో ఈ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణ ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రియాంక కాలనీలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. దంపతులు గొడవ పడుతుండగా 12నెలల పసికందు ఏడ్వడంతో.. ఆ ఏడుపు విని ఇరుగుపొరుగు వారు వస్తారనే కూతురును నేలకేసి కొట్టాడు ఆ దుర్మార్గపు తండ్రి.
ఈ ఘటన తీవ్రంగా గాయపడిన ఆ చిన్నారి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.