భర్తకు నత్తి అని పుట్టింటికి వెళ్లింది.. అక్కడ ప్రియుడితో జంప్ అయ్యింది.. రెండేళ్ల బిడ్డను?

సెల్వి

శనివారం, 13 సెప్టెంబరు 2025 (13:49 IST)
వివాహేతర సంబంధానికి అడ్డుగా వుందని కన్నబిడ్డనే కడతేర్చింది ఓ తల్లి. ఈ ఘటన మెదక్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మెదక్‌ జిల్లా శివ్వంపేట మండలం శబాష్‌పల్లికి చెందిన బొట్టు మమతకు 5ఏళ్ల క్రితం రాయపోల్‌ మండలం వడ్డేపల్లికి చెందిన భాస్కర్‌తో పెళ్లయింది. 
 
భాస్కర్, మమత దంపతులకు చరణ్, తనుశ్రీ ఇద్దరు పిల్లలున్నారు. భాస్కర్‌కు నత్తి వుందనే కారణంతో మమత పుట్టింటికి వెళ్లిపోయింది. పుట్టింట్లో ఉండగా మమతకు అదేగ్రామానికి చెందిన ఫయాజ్‌తో అక్రమసంబంధం ఏర్పడింది.  ఈ ఏడాది మార్చిలో ప్రియుడు ఫయాజ్‌తో కలిసి మమత వెళ్లిపోయింది. 
 
అయితే పెద్దల జోక్యంతో తిరిగి వచ్చిన మమత భాస్కర్‌తో కలిసి జీవించేందుకు ఒప్పుకుంది. జూన్‌ 7న మమత మరోసారి ఫయాజ్‌తో వెళ్లిపోయింది.-కొడుకు శ్రీచరణ్‌ను పుట్టింట్లో వదిలేసి కూతురు తనూశ్రీని తీసుకుని ప్రియుడితో మమత జంపయింది. అయితే పోలీసులకు మమతపై కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. 
 
విచారణలో కూతురు తనుశ్రీని తన వెంట తీసుకెళ్లిన మమత ఊరి చివర  గొంతు పిసికి, గొయ్యి తీసి పాతిపెట్టినట్లు తేలింది. తనుశ్రీని తామే చంపినట్లు విచారణలో ఆ ఇద్దరూ అంగీకరించారు. దీంతో పోలీసులు ప్రియుడితో పాటు ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు