ప్రస్తుతం అసెంబ్లీ రిజిస్ట్రీ నివేదికను పరిశీలిస్తోంది. గతంలో, కేసీఆర్- హరీష్ రావు ఇద్దరూ కాళేశ్వరం కమిటీ నివేదికపై స్టే ఇవ్వాలని కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు. హైకోర్టు ఈ విషయాన్ని విచారించి నోటీసులు జారీ చేసింది. ఈ తీర్పును అక్టోబర్ వరకు రిజర్వ్ చేశారు.
ఏదైనా తప్పులు జరిగితే మంత్రులు లేదా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించాల్సిన అవసరం లేదని హరీష్ రావు పేర్కొన్నారు. కోర్టులు, తెలంగాణ ప్రజలు మాత్రమే దానిని నిర్ణయించగలరని తెలిపారు. కాళేశ్వరంపై పీపీటీ ప్రజెంటేషన్కు అనుమతి నిరాకరించడంతో ప్రభుత్వం సత్యానికి భయపడుతోందని ఆయన ఆరోపించారు.