జీరో కరెంట్ బిల్లు కావాలంటే ఆ పని చేయండి: డిప్యూటీ సిఎం భట్టి

ఐవీఆర్

శనివారం, 9 మార్చి 2024 (21:10 IST)
కాంగ్రెస్ ప్ర‌క‌టించిన 6 గ్యారంటీల అమ‌లులో భాగంగా రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న గృహ‌జ్యోతి ప‌థ‌కం విజయవంతంగా పేద ప్రజలకు ఉపయోగపడుతుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గృహ‌జ్యోతి ప‌థ‌కం ద్వారా ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో 40,33,702 మందికి ఉచితంగా విద్యుత్తును అందిస్తున్నాం.  
 
కొంద‌రు కావాల‌ని త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారు, ఈ త‌ప్పుడు ప్ర‌చారం చేయ‌డం మంచిది కాదు. ప్రజాపాలనలో రేష‌న్ కార్డు నెంబ‌ర్‌, విద్యుత్తు స‌ర్వీసు నెంబ‌ర్‌ను స‌రిగ్గా పొందుప‌రిచి దరఖాస్తు చేసుకున్న ల‌బ్ధిదారుల‌కు ఈ నెల జీరో బిల్లు వ‌చ్చిందని చెప్పారు.
 
ద‌ర‌ఖాస్తులో పొర‌పాటున త‌ప్పులు ప‌డిన వారు వెంట‌నే ఎంపిడివో కార్యాల‌యానికి వెళ్లి అక్క‌డ ఉన్న ప్ర‌జపాల‌న అధికారికి తిరిగి ద‌ర‌ఖాస్తు చేసుకుంటే ఆన్‌లైన్‌లో అప్‌డేట్ అయిన త‌రువాత జీరో బిల్లు వస్తుంది.'' అని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు