తెలంగాణలో వేడి సెగలు.. ఎల్లో అలెర్ట్.. సైఫాబాదులో కారు దగ్ధం

సెల్వి

గురువారం, 7 మార్చి 2024 (16:23 IST)
తెలంగాణలో వేడి సెగలు విపరీతంగా మారాయి. నగరం అంతటా ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల సెల్సియస్‌ను  అధిగమించవచ్చని, కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్‌ను తాకే అవకాశం ఉందని అంచనా.
 
ఈ క్రమంలో జూబ్లీహిల్స్‌ హైదరాబాద్‌లో అత్యంత వేడిగా ఉండే ప్రాంతంగా ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. 
తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ నివేదిక ప్రకారం, జూబ్లీహిల్స్ నగరంలో అత్యంత హాటెస్ట్ స్పాట్‌గా అవతరించింది. 
 
ఇందులో భాగంగా గరిష్ట ఉష్ణోగ్రత 39.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. వేసవి కాలం ప్రారంభమైనందున, జూబ్లీహిల్స్ నివాసితులు బుధవారం నాడు ఉక్కపోత ఉష్ణోగ్రతలతో ఇబ్బంది పడ్డారు. ఈ సంవత్సరం, ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. వేసవిలో సాధారణ ప్రారంభం కంటే చాలా ముందుగానే ఉన్నాయి.  
 
మార్చి మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు 39.1 డిగ్రీల సెల్సియస్‌కు పెరగడంతో చందానగర్ వాసులు వేసవి గరిష్ట స్థాయిని గుర్తుకు తెచ్చే ఎండ వేడిని కూడా భరించారు. గోషామహల్, సంతోష్‌నగర్, యూసుఫ్‌గూడ, మూసాపేట్, రాజేంద్రనగర్‌లతో సహా అనేక ఇతర ప్రాంతాలలో వేడి తన పట్టును విస్తరించింది. 
 
మరోవైపు సైఫాబాద్‌ పీఎస్‌ ఎదురుగా ఉన్న పెట్రోల్‌ బంక్‌ వద్ద కారులో మంటలు చెలరేగాయి. పెట్రోల్‌ పోస్తుండగా కారులో నుండి పొగలు రావడంతో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. పెట్రోల్‌ బంక్‌ సిబ్బంది అప్రమత్తమై కారును బయటకు తోసేశారు. దీంతో మంటలు వ్యాప్తించడంతో కారు దగ్ధమైంది. అప్రమత్తం కావడంతో కారులోని వ్యక్తులు బయటపడ్డారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు