గణేశ్ నిమజ్జనం- గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ మ‌హాగ‌ణ‌ప‌తి (video)

సెల్వి

మంగళవారం, 17 సెప్టెంబరు 2024 (07:59 IST)
khairatabad
గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఈ నెల 17,18 తేదీలలో మద్యం దుకాణాలు బంద్ చేయాలని నగర సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలగకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 
 
అలాగే నవరాత్రులు ఘ‌నంగా పూజలు అందుకున్న ఖైరతాబాద్ మ‌హాగ‌ణ‌ప‌తి గంగమ్మ ఒడికి చేరేందుకు సిద్ధమయ్యాడు. ఈ గ‌ణేశుడి శోభాయాత్ర ప్రారంభ‌మైంది. రెండున్నర కిలోమీటర్ల మేర శోభాయాత్ర కొనసాగనుంది. 
 
టెలిఫోన్‌ భవన్‌, సెక్రటేరియట్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌ మీదుగా సప్తముఖ మహాగణపతి ట్యాంక్‌బండ్‌ చేరుకుంటాడు. మధ్యాహ్నం ఒకటి, రెండు గంటల లోపు నిమజ్జనం పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మహాగణపతిని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. 

ప్రారంభమైన ఖైరతాబాద్ సప్తముఖ మహాగణపతి శోభాయాత్ర.

మధ్యాహ్నం 1.30 గంటల వరకు NTR మార్గ్ క్రేన్ నంబర్-4 దగ్గరికి చేరుకోనున్న ఖైరతాబాద్ మహాగణనాథుడు. pic.twitter.com/mC7bGVdK2y

— Telugu Scribe (@TeluguScribe) September 17, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు