కొండమ్మా.. ఏంటిదంతా? మంత్రి కొండా సురేఖకు సీఎం రేవంత్ రెడ్డి క్లాస్

ఐవీఆర్

మంగళవారం, 15 అక్టోబరు 2024 (17:35 IST)
కర్టెసి-ట్విట్టర్
ఇటీవల వరుస వివాదాలలో ఇరుక్కుంటూ వస్తున్న మంత్రి కొండా సురేఖపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకింత సీరియస్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నాగార్జున కుటుంబం, సమంతపై కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆమె వ్యాఖ్యలపై సినిమా ఇండస్ట్రీకి చెందిన వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఖండించారు.
 
ఆ వివాదం అలా వుండగానే గీసుకొండ పోలీస్ స్టేషన్‌లో సీఐ కుర్చీలో కూర్చుని పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు సురేఖ. అంతేకాదు... వేములవాడ ఆలయంలో స్వామి వారి నైవేద్యాన్ని ఆపి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇవన్నీ మీడియాలో చక్కెర్లు కొడుతూ వుండటంతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కొండా సురేఖను వివరణ కోరినట్లు సమాచారం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు