Love Failure: ప్రేమ విఫలం.. ప్రియురాలు రైలుకింద పడితే.. ప్రియుడు బావిలో దూకేశాడు (video)

సెల్వి

సోమవారం, 8 సెప్టెంబరు 2025 (20:53 IST)
ప్రేమ విఫలమైందని ఓ యువ జంట ఆత్మహత్యకు పాల్పడింది. తమ ప్రేమకు పెద్దలు అంగీకరించకపోవడంతో ఇక లాభం లేదనుకున్న ఆ జంటలో వేర్వేరుగా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రేమ విఫలమైందని ట్రైన్ కింద పడి ప్రియురాలు హితవర్షిణి ఆత్మహత్యకు పాల్పడింది. 
 
ప్రియురాలి మరణ వార్త విని ప్రియుడు వినయ్ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 
 
ఘట్కేసర్‌లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో హితవర్షిణి బిటెక్ ఫోర్త్ ఇయర్ చదువుతున్నారని తెలిసింది. అలాగే మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కొర్విచెల్మ గ్రామంలో ఇలా ప్రేమికులు ప్రేమ కోసం బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. 

ప్రేమ విఫలమైందని ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్న ప్రియురాలు హితవర్షిణి

ప్రియురాలి మరణ వార్త విని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ప్రియుడు వినయ్

ఘట్కేసర్ లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బిటెక్ ఫోర్త్ ఇయర్ చదువుతున్న హితవర్షిణి

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కొర్విచెల్మ… pic.twitter.com/3P9jaqKMaw

— BIG TV Breaking News (@bigtvtelugu) September 8, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు