స్టెమ్, SDGల ద్వారా గ్రామీణ తెలంగాణ పిల్లలను భవిష్యత్తుకు సిద్ధం చేస్తున్న ఎన్‌ఎక్స్‌ప్లోరర్స్

ఐవీఆర్

శనివారం, 23 మార్చి 2024 (18:53 IST)
షెల్ ఇండియా మద్దతుతో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి వరంగల్‌లోని ప్రాంతీయ విజ్ఞాన కేంద్రంలో ఎన్‌ఎక్స్‌ప్లోరర్స్ కార్నివాల్‌ని స్మైల్ ఫౌండేషన్ నిర్వహించింది. జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా గ్రామీణ పాఠశాల పిల్లలకు స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్), SDG (యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్)ల పట్ల అవగాహన కల్పిస్తూనే తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఒక వేదికను అందించాలనే లక్ష్యంతో రోజంతా కార్నివాల్ నిర్వహించబడింది.
 
కార్నివాల్ సందర్భంగా, శ్రీమతి సిక్తా పట్నాయక్, IAS, కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్, హన్మకొండ; శ్రీ మనోహర్ రెడ్డి, ప్రాంతీయ సమన్వయ అధికారి, MJP పాఠశాలలు, పూర్వ వరంగల్; శ్రీమతి వి రాధ, చీఫ్ మానిటరింగ్ ఆఫీసర్; శ్రీ శ్రీనివాసాచారి, జిల్లా సైన్స్ అధికారి, హన్మకొండ; డాక్టర్ కె. శ్రీనివాస్  తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాకు చెందిన జిల్లా సైన్స్ అధికారి వంటి వారు హాజరుకావటంతో పాటుగా ప్రదర్శనలో ఉన్న ఉత్తమ శాస్త్రీయ నమూనాలు, స్థిరమైన ఆలోచనలను ఎంపిక చేసి, ఈ ప్రదర్శనలో పాల్గొన్న పిల్లలను ప్రోత్సహించారు.
 
ముఖ్య అతిథి శ్రీమతి సిక్తా పట్నాయక్, IAS, కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్, హన్మకొండ మాట్లాడుతూ, “ఈ కార్నివాల్‌లో భాగం కావడం నిజంగా సంతోషంగా వుంది, ఇందులో ఆడపిల్లల భాగస్వామ్యం చాలా ఎక్కువగా ఉంది. ప్రభుత్వ పాఠశాలలకు చేరువ కావడానికి స్మైల్ ఫౌండేషన్ చేస్తున్న ఈ కార్యక్రమం నిజంగా అభినందనీయం, దయచేసి ఈ పనిని కొనసాగించడంతో పాటుగా పిల్లలలో మార్పు తీసుకురావటానికి కృషి చేయండి" అని అన్నారు.
 
తెలంగాణలోని వరంగల్, హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి, జనగాం, ములుగు, మహబూబాబాద్ జిల్లాలకు చెందిన 35  పాఠశాలలకు చెందిన 176 మంది విద్యార్థులు సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ (STEM) విభాగాల్లో రూపొందించిన ప్రాజెక్టుల నుంచి 52 ఎంపిక చేసిన మార్పు ప్రాజెక్టులు, వినూత్న నమూనాలను ప్రదర్శించారు. రోజువారీ సమస్యలు, స్థిరమైన వ్యవసాయ ప్రక్రియలు, ఉద్గారాలను నియంత్రించడం, ప్రకృతి పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలతో (SDGలు) అనుసంధానించబడిన అనేక రంగాలకు సంబంధించిన వినూత్న ఆలోచనలతో వర్కింగ్ మోడల్స్‌ను తీసుకుని పాఠశాల పిల్లలు ముందుకు వచ్చారు.
 
స్మైల్ ఫౌండేషన్ తెలంగాణలోని వరంగల్, ఖమ్మం, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, జనగాం, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం వంటి ఎనిమిది జిల్లాల్లోని 116 ప్రభుత్వ పాఠశాలల్లో షెల్‌కు చెందిన గ్లోబల్ ఫ్లాగ్‌షిప్ సోషల్ ఇన్వెస్ట్‌మెంట్ స్టెమ్ ఎడ్యుకేషనల్ కార్యక్రమం అయిన ఎన్‌ఎక్స్‌ప్లోరర్స్ జూనియర్ ప్రోగ్రామ్‌ను అమలు చేస్తోంది. అంతేకాకుండా, కేరళలోని త్రిసూర్ జిల్లాలోని 77 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, నెల్లూరు జిల్లాల్లోని 89 ప్రభుత్వ పాఠశాలలు కూడా పాఠశాల పిల్లల కోసం అంతర్జాతీయంగా విజయవంతమైన ఈ కార్యక్రమం కింద ఉన్నాయి.
 
వరంగల్ జిల్లా సైన్స్ అధికారి డా.కె.శ్రీనివాస్ మాట్లాడుతూ, “తెలంగాణలో ప్రభావవంతమైన కమ్యూనిటీ కార్యక్రమాలకు, కార్నివాల్ రూపంలో సైన్స్ ఎగ్జిబిషన్‌ను విజయవంతంగా నిర్వహించినందుకు స్మైల్ ఫౌండేషన్ యొక్క అత్యుత్తమ ప్రయత్నాలకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. సుస్థిర లక్ష్యాలకు సాయపడే ఎన్‌ఎక్స్‌ప్లోరర్స్ వంటి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేలా పిల్లలను ప్రేరేపించేలా ఉపాధ్యాయులను ప్రోత్సహించాలనుకుంటున్నాను..." అని అన్నారు. హన్మకొండ జిల్లా సైన్స్ అధికారి శ్రీ శ్రీనివాసాచారి మాట్లాడుతూ, “నేను పిల్లలను ప్రశ్నించడం నేర్చుకొమ్మని ప్రోత్సహిస్తాను, జ్ఞానాన్ని సంపాదించడానికి పుస్తకాలను ఎలా చదవాలో నేర్చుకోవాలి, వారి కలలను సాకారం చేసుకునేందుకు ఉత్సుకత కలిగిన మనస్తత్వాన్ని పెంపొందించుకోవాలి ”అని అన్నారు. 
 
శ్రీ మనోహర్ రెడ్డి, RCO MJPTBC స్కూల్స్, వరంగల్ మాట్లాడుతూ, "మా జిల్లాలోని MJP, ప్రభుత్వ పాఠశాలల్లో పదిహేను నెలలుగా ఎన్‌ఎక్స్‌ప్లోరర్స్  కార్యక్రమాన్ని స్మైల్ ఫౌండేషన్ అమలు చేస్తోంది, తమ ముందు ఉన్న భావి ప్రపంచం కోసం, మా విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడంలో వారి సహకారాన్ని మేము అభినందిస్తున్నాము..." అని అన్నారు. హన్మకొండ చీఫ్ మానిటరింగ్ ఆఫీసర్ శ్రీమతి వి.రాధ మాట్లాడుతూ, ''పాఠశాలల్లో ఎన్‌ఎక్స్‌ప్లోరర్స్ వర్క్‌షాప్‌ల ద్వారా అందించే ఇన్‌పుట్‌లు సమాజంలో స్థిరమైన మార్పును తీసుకురావడానికి ఈ యువకులలో విశ్వాసాన్ని నింపుతున్నాయి. క్యాచ్-దెమ్-యంగ్ నినాదాన్ని స్మైల్ ఫౌండేషన్ బాగా అనుసరిస్తున్నందుకు నేను నిజంగా సంతోషంగా ఉన్నాను..." అని అన్నారు. 
 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు