భార్య గర్భవతి.. ఆరు రోజుల నవజాత కుక్కపిల్లల్ని దారుణంగా చంపిన భర్త.. సీసీటీవీలో? (video)

సెల్వి

గురువారం, 17 ఏప్రియల్ 2025 (10:54 IST)
Puppies
హైదరాబాద్‌లోని ఒక గేటెడ్ కమ్యూనిటీ సెల్లార్‌లో ఆరు రోజుల వయసున్న వీధి కుక్కపిల్లలను ఒక వ్యక్తి గోడకు కొట్టి, తన కాళ్లతో తొక్కి చంపిన దారుణమైన జంతు హింసకు సంబంధించిన ఘటన ఇది. ఈ సంఘటన స్థానికులను  దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దారుణమైన సంఘటన మచ్చా బోలారామ్‌లోని గేటెడ్ సొసైటీ అయిన ఇండిస్ వీబీ సిటీలో జరిగింది. నివాసితులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు, వ్యాపారవేత్త, సొసైటీ నివాసి అయిన ఆశిష్, ఏప్రిల్ 14 తెల్లవారుజామున ఐదు కుక్కపిల్లలను చంపాడు. 
 
అతను తెల్లవారుజామున 1.20 గంటల ప్రాంతంలో సెల్లార్‌లోకి ప్రవేశించి, అక్కడ నవజాత కుక్కపిల్లలను కనుగొని గోడకు విసిరినట్లు ఫుటేజ్ చూపిస్తుంది. వాటిలో కొన్ని ఇంకా బతికే ఉండటంతో, అతను వాటి తలలను తన పాదాలతో తొక్కాడు. అవి చనిపోయాయని నిర్ధారించుకోవడానికి ఇటుకతో కొట్టాడని ఆరోపించారు. 
 
మంగళవారం నివాసితులు కుక్కపిల్లల చెల్లాచెదురుగా ఉన్న అవశేషాలను కనుగొన్నారు. ఏమి జరిగిందో తెలుసుకోవడానికి సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. ఆ ఫుటేజ్ చూసిన తర్వాత వారు షాకయ్యారు. "ఆశిష్ తరచుగా వీధి కుక్కలను వేధించడం, వాటిపై రాళ్ళు విసరడం, కర్రలతో కొట్టడం చూశాను" అని నివాసి సత్తార్ ఖాన్ అన్నారు. 
 
ఈ ఘటనపై జంతు సంక్షేమ కార్యకర్త ముదావత్ ప్రీతి మాట్లాడుతూ, "వీధులపై ఇటువంటి క్రూరమైన చర్యలు పెరుగుతున్నాయి. ఇటువంటి క్రూరత్వాన్ని అరికట్టడానికి కఠినమైన శిక్ష విధించాలి" అని అన్నారు. దీనిపై అల్వాల్ పోలీస్ స్టేషన్ SHO రాహుల్ దేవ్ ఫిర్యాదు అందిందని ధృవీకరించారు. "ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయబడుతుంది. తదుపరి దర్యాప్తు జరుగుతుంది" అని ఆయన అన్నారు. ఇంకా నిందితుడి భార్య గర్భవతి అని.. తన భర్త చేసిన దుశ్చర్యకు ఆమె షాక్ అయ్యిందని పోలీసులు వెల్లడించారు. 

Sensitive Content

హైదరాబాద్ - ఫతేనగర్ హోమ్ వ్యాలీలో అప్పుడే పుట్టిన 5 కుక్క పిల్లలు చంపిన దుర్మార్గుడు

అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో తన పెంపుడు కుక్క దగ్గరకు వీధి కుక్క వచ్చిందని దాని 5 పిల్లలను చంపిన మూర్కుడు pic.twitter.com/psfJsURZYE

— Telugu Scribe (@TeluguScribe) April 17, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు