గత ఎన్నికల ప్రచర సమయంలో కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తమ పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయని ఆరోపిస్తూ తెలంగాణ బీజేబీ శాఖ పరువు నష్టం దావా వేసింది. తొలుత ఈ కేసును తెలంగాణ హైకోర్టుల దాఖలు చేయగా, విచారణ అనంతరం న్యాయస్థానం ఆ పిటిషన్ను కొట్టివేసింది.
హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బీజేపీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరు పక్షాల వాదనలు ఆలకించిన ధర్మాసనం రాజకీయ నాయకులు చేసే ఆరోపణలు, ప్రత్యారోపణలకు సంబంధించిన వివదాల్లో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ క్రమంలో బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ను డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఈ పరువు నష్టం దావా కేసులో సీఎం రేవంత్ రెడ్డికి పూర్తి స్థాయిలో ఊరట లభించినట్టయింది.