ఆరేళ్ల బాలిక పైన అత్యాచారానికి పాల్పడ్డ కామాంధుడు..!

శనివారం, 12 మే 2018 (13:40 IST)
హైదరాబాద్ మలక్ పేట్ వాహెద్ కాలనీలో దారుణం జ‌రిగింది. ఆరెళ్ల బాలికపై అత్యాచారానికి పాల్ప‌డ్డాడు కామాంధుడు ఇస్మాయిల్. ఈ విష‌యం తెలుసుకున్న స్థానిక‌లు ఆ కామాంధుడిని చితకబాదారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇస్మాయిల్‌ని చాదర్‌ఘాట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
అర్థరాత్రి ఎంఐఎం ఎమ్మెల్యే బలాల పోలీసు స్టేష‌న్‌కు చేరుకోవ‌డంతో చాదర్‌ఘాట్ పోలీసుస్టేషన్ వద్ద ఉద్రిక్తత ఏర్ప‌డింది. అత్యాచారానికి గురైన బాలికను నాంపల్లిలోని భరోసా సెంటర్‌కు పంపించారు. సుల్తాన్ బజార్ ఏసీపీ చేతన అక్క‌డ‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. నిందితుడిని పట్టుకున్నామని.. చట్టప్రకారం అతన్ని కోర్టులో హాజరుపర్చి శిక్షిస్తామని పోలీసులు చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు