తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త

గురువారం, 3 మార్చి 2022 (10:14 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ఆర్టీసీ ప్రయాణికులకు ఆ సంస్థ ఎండీ సజ్జనార్ శుభవార్త చెప్పారు. ఇందులోభాగంగా ఆయన మరో ఆఫర్‌ను ప్రకటించారు. ప్రయాణికులను ఆకట్టుకునేదుకు వివిధ రకాలైన విన్నూత్న పథకాలను చేపడుతున్నారు. ఇందులోభాగంగా, మరో ఆకర్షణీయమైన స్కీన్‌ను ఆయన ప్రవేశపెట్టారు. 
 
ఇందులోభాగంగా, 250 కిలోమీటర్లకు పైగా దూర ప్రాంతాలకు వెళ్లేందుకు ముందుగా టిక్కెట్ రిజర్వు చేసుకునే ప్రయాణికులు వారి ఇంటి వద్ద నుంచి బోర్డింగ్ పాయింట్ వరకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పించారు. జంట నగరాల్లో ప్రయాణానికి ముందు 2 గంటలు, ప్రయాణం తర్వాత 2 గంటల సమయం వరకు ఈ అవకాశం వర్తిస్తుందని ఆయన వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేశారు. 

 

250 KM ల పై ఉన్న దూర ప్రాంతాలకు ముందస్తు #TSRTCTicket రిజెర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు తమ ఇంటి వద్ద నుండి #TSRTCBus ఎక్కు ప్రాంతం వరకు సిటీలో ఉచితంగా ప్రయాణించవచ్చు. #Hyderabad జంటనగరాలలో ప్రయాణానికి 2 గంటలు ముందు, మరియు ప్రయాణం తర్వాత 2 గంటలు వర్తించును. #TSRTCFreeBusTravel pic.twitter.com/YIZLPcIH8Y

— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) March 2, 2022

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు