నేడు రైతుల ఖాతాల్లోకి ఇన్‌పుట్ సబ్సీడీ

మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (07:20 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు శుభవార్త చెప్పింది. రైతుల ఖాతాల్లోకి ఇన్‌పుట్ సబ్సీడీని మంగళవారం జమచేయనుంది. గత 2021 నవంబరు నెలలో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఈ ఇన్‌పుట్ సబ్సీడీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెల్సిందే. దీంతో ఈ మొత్తాన్ని రైతుల ఖాతాల్లోకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జమ చేయనున్నారు. 
 
మంగళవారం ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో నగదును జమ చేయనున్నారు. 5,71,478 మంది రైతుల ఖాతాల్లోకి రూ.543.77 కోట్లను జమ చేయనున్నారు. అలాగే, 1220 రైతు గ్రూపులకు వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం కింద రూ.29.51 కోట్లను అందజేయనున్నారు. ఈ రెండు పథకాలకు మొత్తం రూ.564.28 కోట్లను జమ చేయనుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు