తెలంగాణాలో బీజేపీకి మరో షాక్.. కాంగ్రెస్ గూటికి డీకే అరుణ?

గురువారం, 26 అక్టోబరు 2023 (15:01 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి వచ్చే నెలలో ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంది. అధికార భారాస, విపక్ష కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి. దీంతో త్రిముఖ పోటీ నెలకొంది. అయితే, ఎన్నికల తేదీలు సమీపిస్తున్న వేళ భారతీయ జనతా పార్టీకి గట్టి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. 
 
ఇప్పటికే ఆ పార్టీకి చెందిన కాంగ్రెస్ మాజీనేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు బీజేపీకి రాంరాం చెప్పేసి, తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాజీ సీనియర్ మహిళా నేత, మాజీ మంత్రి డీకే అరుణ కూడా తిరిగి సొంత గూటికి చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. 
 
నిజానికి ఈ ఎన్నికల షెడ్యూల్ వెల్లడైనప్పటి నుంచి అధికార బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన అనేక మంది సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. దీనని నిజం చేసేలా పలువురు సీనియర్ నేతలు కాంగ్రెస్ పంచన చేరుతున్నారు. తాజాగా, డీకే అరుణ కూడా సొంత గూటికి చేరుతున్నారనే ప్రచారం సాగుతుంది. 
 
ఈ వార్తలపై ఆమె స్పందించారు. తాను బీజేపీని వీడే ప్రసక్తే లేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశమే లేదని తెలిపారు. తనపై కొందరు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ అధినాయకత్వం తను గుర్తించి జాతీయ ఉపాధ్యక్ష పదవిని ఇచ్చిందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో పని చేయాలంటే ఎవరికైనా అదృష్టం ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు