కన్నతండ్రి కాదు.. కసాయి తండ్రి.. కుమార్తెల గొంతు కోశాడు..?

శనివారం, 7 నవంబరు 2020 (14:56 IST)
మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామంలో దారుణం జరిగింది. ఓ తండ్రి తన కుమార్తెల పట్ల క్రూరంగా ప్రవర్తించాడు. ఇద్దరు కుమార్తెల గొంతు కోశాడు తండ్రి. దీన్ని గమనించిన స్థానికులు.. తక్షణమే పోలీసులకు సమాచారం అందించి.. ఇద్దరి పిల్లల ప్రాణాలు కాపాడారు. 
 
వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్ర నాందేడ్‌కు చెందిన ఎండీ మహమ్మద్ 15 సంవత్సరాల క్రితం మిర్‌దొడ్డి మండలంలోని మోతే గ్రామానికి వలసొచ్చాడు. మోతే గ్రామంలో మాంసం విక్రయిస్తూ జీవనోపాధి కొనసాగిస్తున్నాడు. 
 
అయితే శుక్రవారం రోజు దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన గుంజేడు సాయిలు ఇంట్లో మహమ్మద్ అద్దెకు దిగాడు. శనివారం ఉదయమే పీకల దాకా మద్యం సేవించిన మహమ్మద్‌.. ఆ మత్తులో తన ఇద్దరు కుమార్తెలను ఇంట్లో బంధించి.. చంపేస్తానని బెదిరించాడు. 
 
విషయం తెలుసుకున్న స్థానికులు భూంపల్లి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పిల్లలను చికిత్స నిమిత్తం సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. పిల్లల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు