మహిళ కోసం యాచకుల మధ్య కీచులాట.. ఒకరు హత్య!

మంగళవారం, 2 జూన్ 2020 (16:54 IST)
హైదరాబాద్ నగరంలో ఓ మహిళ కోసం ఇద్దరు యాచకులు గొడవకు దిగారు. ఈ గొడవ కాస్త చిలికి చిలికి గాలివానలా మారి ఓ భిక్షగాడు హత్యకు గురయ్యాడు. ఈ కేసులో హైదరాబాద్ నగర పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ నాగరాజు వెల్లడించిన వివరాల మేరకు... సర్దార్‌(35), ఖాజా పాషా(40) అనే ఇద్దరు యాచకులు ఫుట్‌పాత్‌పై ఉంటూ ప్రతిరోజూ యాచకవృత్తి చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ క్రమంలో ఓ యాచకురాలి (మహిళ) కుమారుడు ఏడాదిన్నర బాలుడు ఇటీవల కిడ్నాపయ్యాడు. బాలుడిని కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి చిన్నారిని తల్లికి అప్పగించారు. 
 
ఆ సమయంలో ఇద్దరు యాచకులు ఆ మహిళ వెంట ఉన్నారు. యాచకులిద్దరూ ఆమెపై మనసుపడ్డారు. దీంతో ఆమె కోసం పాషా, సర్ధార్‌ ఆదివారం అర్థరాత్రి గొడవపడ్డారు. సంతోష్‌ అనే వ్యక్తితో కలిసి పాషా... సర్దార్‌ను పిడిగుద్దులు గుద్దడంతో అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. 
 
ఈ విషయం స్థానిక పోలీసుల దృష్టికి చేరడంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు... సర్దార్‌ హత్యకు కారకుడైన పాషాతోపాటు సహకరించిన సంతోష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు